ఒక నగరం జీవితకాలంలో వందేళ్ళు ఏమంత పెద్దది కాదు. అందులో విశేష మూ ఉండదు. ఢిల్లీ నగరం మాత్రం ఇందుకు భిన్నం. ఈ నగరం దేశరాజధాని హోదాను సంతరించుకొని వందేళ్ళు గడిచాయి. ఈ వం దేళ్ళలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకు న్నాయి. పాత ఆనవాళ్ళు చెదిరిపోయాయి. కొత్త ఆనవాళ్ళు వచ్చిపడ్డాయి. ఒక శతాబ్ది కా లంలో...ఒక్కో దశాబ్దిలో ఒక్కో రకం పోకడ. వెరసి నేటికి రాజధాని ఢిల్లీ ‘న్యూఢిల్లీ’గా మారిపోయింది. ‘‘కౌన్సిల్లో గవర్నర్ జనరల్తో సంప్రదిం పుల అనంతరం మంత్రులు ఇచ్చిన సలహా మేరకు భారత ప్రభుత్వం దేశ రాజధానిని కలకత్తా నుంచి ప్రాచీన రాజధాని అయిన ఢిల్లీకి మార్చాలని నిర్ణయించినట్లు తెలియజే సేందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం’’ - అని 1911 డిసెంబర్ 12న నాటి రాజు ఐదో జార్జ్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆయన దేశం లో సంచలనం కలిగించారు. 18వ శతాబ్ది నుంచి కూడా బ్రిటిష్ సామ్రాజ్యానికి భారతదేశంలో ఆయువుపట్టుగా ఉన్న కలకత్తా నుంచి రాజధాని హోదా ఢిల్లీకి మారింది. ఆ ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచే ఢిల్లీకి రాజధాని హంగులు సమకూరసాగాయి.
భారత సామ్రాజ్యాధీశుడిగా కింగ్ జార్జ్ను పట్టాభిషిక్తుడిని చేసే సమయంలో రాజధాని మార్పు ప్రకటన వెలువడింది. అప్పట్లో ఢిల్లీ జనాభా 2,33,000గా ఉండింది. చక్రవర్తి పర్యటనను పురస్కరించుకొని, ఇటీవల కామ న్వెల్త్ గేమ్స్ సందర్భంగా చేసినట్లుగానే, 300 మంది అసాంఘిక శక్తులను అరెస్టు చేశారు. ఇలా అరెస్టు అయిన వారిలో నిరుపేదలే అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ ఆనవాయితీకి పట్టాభిషేక మహోత్సవం నుంచే బీజం పడింది. అది నేటికీ కొనసాగుతోంది.
ఎంతో గోప్యం

ఢిల్లీని నూతన రాజధానిగా తీర్చిదిద్దడం ఎన్నో సవాళ్ళతో కూడుకున్నదిగా ఉండింది. ఢిల్లీ పట్టణానికి అవసరమైన మౌలిక వసతు లను సమకూర్చడం కన్నా పట్టణానికి నగర రూపురేఖలు జోడించడమే అప్పట్లో బ్రిటిష్ వారికి ప్రధానంగా ఉండింది. నేటికీ అదే తరహాలో ఢిల్లీ అభివృద్ధి కొనసాగుతోంది. కొత్తఢిల్లీ నిర్మాణయత్నం ఢిల్లీని రాజధానిగా ప్రకటించిన వెంటనే ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కాలిక ఏర్పా ట్లు మొదలయ్యాయి. పాత ఢిల్లీకి చేరువలోనే కొత్త ఢిల్లీని నిర్మించే ప్రయత్నాలూ ఆరంభ
మయ్యాయి. అందుకోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. సబ్జి మండి, సివిల్ లైన్స్ తది
తరాలను పరిశీలించి వివిధ కారణాల రీత్యా తోసిపుచ్చారు. చివరకు రైజినా గ్రామ ప్రాం తం బ్రిటిష్ ఉన్నతాధికారులకు నచ్చింది.
అక్కడ ఉన్న గుట్టను తొలచివేసి ప్రభుత్వ భవ నాల నిర్మాణాలను ఆరంభించారు. ఎడ్విన్ లాండ్సీర్ లుటెన్స్, తన స్నేహితుడు హెర్బెర్ట్ బాకెర్ అనే ఆర్కిటెక్ట్లు ఈ పనులు చేపట్టా రు. లుటెన్స్ అప్పటి వరకూ గొప్ప ట్రాక్ రికా ర్డు ఏమీ లేనప్పటికీ, కొంతమంది బ్రిటిష్ సంపన్నుల భవనాలను అందంగా నిర్మించిన కారణంగా ఆయనకు ఈ పని అప్పచెప్పారు. నాటి వైస్రాయి లార్డ్ లైటన్ ఏకైక కుమార్తెను లుటెన్స్ వివాహం చేసుకోవడం కూడా ఇందు కు కారణం కావచ్చు. స్థూలంగా న్యూఢిల్లీ, గవర్నమెంట్ హౌస్ (రాష్టప్రతి భవన్) డిజైన్ ను లుటెన్స్ పర్యవేక్షించగా, సెక్రటరి యేట్స్ (నార్త్ , సౌత్ బ్లాక్స్), కౌన్సిల్ (పార్ల మెంట్) డిజైన్ బాధ్యతలను బాకెర్ చేపట్టారు. బ్రిటిష్ సామ్రాజ్య దర్పాన్ని ప్రతిబింబించే విధంగా ఆనాటి భవనాలు, కట్టడాలు రూపుదిద్దు కున్నాయి. ఢిల్లీలో యూనివర్సిటీ కోసం నాటి నాయ కులు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఫలితంగా 1922లో అక్కడ యూనివర్సిటీ రూపుదిద్దుకుంది. దాని నిర్మాణానికి అరకొర నిధులనే వెచ్చించారు.
ఎన్నెన్నో సమస్యలు

మాస్టర్ ప్లాన్
ఢిల్లీ ప్రణాళికారహితంగా విస్తరించడం మొదలైంది. దీనిపై నాటి ప్రధాని నెహ్రూ సై తం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణాళికాబ ద్దంగా ఢిల్లీని విస్తరించే ప్రయత్నాలకు అప్పు డే బీజం పడింది. విస్తరణను నియంత్రించేం దుకు ఒక సెంట్రల్ అథారిటీ ఉండాలని నెహ్రూ భావించారు. 1957లో మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటయ్యాయి. మాస్టర్ ప్లాన్ను రూపొందించే యత్నాలు మొదలయ్యాయి.
1981 వరకు ఢిల్లీ విస్తరణ అంతా ఆనాడు నెహ్రూ ఆమోదించిన మార్గదర్శకాలకు అను గుణంగానే జరిగింది. చారిత్రక కట్టడాల చుట్టూరా ఉన్న విశాల స్థలాలను ఉద్యానవనా లుగా తీర్చిదిద్దారు. పచ్చదనం పెంపొందిం చారు. నేడు ఢిల్లీ ఎన్నో పర్యాటక, చారిత్రక స్థలాలతో అలరారుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ వీసీగా ఉండిన గ్యాయర్ ఆ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతో కృషి చే శారు. ఎన్నో కళాశాలలను ఏర్పాటు చేశారు. మరోవంకన ఢిల్లీ విలాసజీవితానికి మారు పేరుగా కూడా మారిపోయింది. ఆరోగ్య సదు
పాయాలు, ఆసుపత్రులు విస్తరించాయి. ఢిల్లీ అభివృద్ధికి మరాఠాలు, బెంగాలీలు, తమిళు లతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఎంతో కృషి చేశారు. నేడు ఢిల్లీ నగరం భిన్న ప్రాంతీయుల ఆచార వ్యవహారాలతో కళకళలాడుతుంటుంది. ఎవ రికి ఏ పండుగ వచ్చినా మిగిలిన వారూ ఆ వేడుకలో భాగస్వాములవుతుంటారు.
రవాణా

కన్నాట్ ప్లేస్
ఢిల్లీలో కన్నాట్ ప్లేస్ అనేది వృత్తాకారంలో ఉన్న వాణిజ్య ప్రాంతం. దీని అవుటర్ రింగ్ నుంచి 12 మార్గాలు ఉన్నాయి. ఇందులో ఒకటి జన్పథ్.
జనాభా

ప్రగతి మైదాన్
ప్రగతి మైదాన్లో జరిగే ఆటో ఎక్స్పో ఆసి యాలోనే అతిపెద్దదిగా చెప్పవచ్చు. రెండేళ్ళ కోసారి ఈ ప్రదర్శన జరుగుతుంది.
సిస్టర్ సిటీస్
న్యూఢిల్లీ షికాగో (అమెరికా), లండన్ (బ్రిటన్), ఉలాన్ బటార్ (మంగోలియా), మాస్కో (రష్యా), సెయింట్ పీటర్స్బర్గ్ (రష్యా), జోహాన్స్ బర్గ్ (దక్షిణాఫ్రికా)లతో సిస్టర్ సిటీ ఒప్పందాలను కలిగి ఉంది.
గతమెంతో ఘనం

ఒకప్పుడు 70,000 మంది అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన ఢిల్లీ నగరంలో నేడు 1.6 కోట్ల మంది నివసిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా మౌలిక వసతులు మాత్రం వృద్ధి చెందలేదు. పర్వతపంక్తిని దెబ్బ తీయడం, యమునా నదిని కలుషితం చేయడం లాంటి వి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఢిల్లీ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒకప్పుడు ఒకే వర సగా ఉన్న కొండలు, గుట్టలు నేడు ఎక్కడిక్క డ ముక్కచెక్కలుగా మారాయి. పట్టణీకరణ అటు కొండలను, ఇటు యమునా నదిని దెబ్బ తీస్తోంది.
వేగంగా విస్తరిస్తున్న నగరం

చరిత్రలో సుస్థిర స్థానం

ఫ్యాషన్లకు నిలయం
1930 ప్రాంతం నుంచే ఢిల్లీలో మహిళల జీవనశైలిలో పెనుమార్పులు వ్యక్తమవుతూ వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ బాక్సా ఫీస్ బ్లాక్బస్టర్ సినిమాలు ఈ మార్పులకు కారణమనవచ్చు. విదేశీయుల తాకిడి అధి కంగా ఉండడం, మెట్రోపాలిటన్ సంస్కృతి ఇవన్నీ ఢిల్లీని ఫ్యాషన్ కేంద్రంగా మార్చా యి. వివిధ రకాల ఫ్యాషన్ మ్యాగజైన్లు లాంటివి కూడా ఇందుకు కారణమయ్యా యి. స్వాతంత్య్రం రాకముందు వరకు కూడా బ్రిటన్ లైఫ్స్టయిల్ ఢిల్లీ నగరంపై తన ప్రభావాన్ని విపరీతంగా కనబర్చింది.
ఇదీ నేటి పరిస్థితి
ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిల్చిన ఢిల్లీ నగరం నేడు అశాంతికి నిల యంగా మారిపోయింది. ఉగ్రవాదం పడగ నీడన ఢిల్లీవాసులు కాలం గడుపుతున్నారు. ఏ క్షణంలో ఎక్కడ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. సామాజిక అశాంతి పెచ్చుమీరిపోయింది. భూఆక్ర మణలు పెరిగిపోయాయి. అడ్డూ అదుపు లేకుండా నగరం విస్తరిస్తుండడంతో చుట్టు పక్కల పల్లెల్లోని వారు ఏ క్షణంలో తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుం టుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఢిల్లీలోని ముఖ్య స్థలాలు
